వన్యమృగాలు అయిన పులి, సింహం లాంటి జంతువులు వాటి పని విసిరితే అవతల ఎంత పెద్ద జంతువు అయినా సరే ఇట్టే నేలమట్టం అయ్యే పరిస్థితి ఎన్నో చూశాం.ముఖ్యంగా పులి, సింహం లాంటి జంతువులను చూసి మిగతా జంతువులు కాస్త భయంతో దూరంగా వెళ్లిపోవడం మనం ఎన్నో వీడియోలలో గమనించవచ్చు.
మిగతా జంతువులు వన్యమృగాల కంటిలో పడితే అవి వాటి ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత పరిగెత్తిన చివరికి వాటికి ఆహారంగా మారిపోతాయి.అయితే.
, తాజాగా ఓ వైరల్ అవుతున్న వీడియోలో ఓ పులి ఖడ్గమృగం ని చూసి పారిపోవడం గమనించవచ్చు.అదికూడా నానా తంటాలు పడి పరిగెత్తి చివరకు పులి ప్రాణాలు కాపాడుకుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.
భారత్ లోనే కాజీరంగా నేషనల్ పార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ అలాగే ఖడ్గ మృగం మధ్య సంఘటన జరిగింది.ఖడ్గమృగం ను చూసి రాయల్ బెంగాల్ టైగర్ పరిగెత్తిన వీడియోను ఫోటోగ్రాఫర్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది కాస్త అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది.
ఇక వీడియో సంగతి విషయానికి వస్తే ఓ నీటి కొలను వద్ద పులి అదే ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్న రాయల్ బెంగాల్ టైగర్ ను వేటాడేందుకు చూస్తూ ఉంది.అయితే ఆ విషయాన్ని పసిగట్టిన ఖడ్గమృగం వెంటనే బెంగాల్ టైగర్ పై ఎదురు తిరిగింది.
ఈ అనుకోని సంఘటనతో పులి ఖడ్గమృగము నుండి బయట పడేందుకు ఆ నీటిలో నానా కష్టాలు పడుతూ చివరికి బురదలో నుంచి బయటికి వచ్చి తన ప్రాణాన్ని కాపాడుకుంది.ఈ సంఘటనకు సంబంధించి మొత్తం వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో నెటిజన్స్ పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.