బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఊహించని స్థాయిలో హైపర్ ఆది పాపులారిటీని సొంతం చేసుకున్నారు.హైపర్ ఆది వేసే సింగిల్ లైన్ పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
అయితే ఆ పంచ్ లపై కొన్నిసార్లు తీవ్రస్థాయిలో విమర్శలు సైతం వ్యక్తమవుతూ ఉంటాయి.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా హైపర్ ఆది రష్మీ, శాంత కుమార్ పై పంచ్ లు వేశారు.
అయితే ఆది పంచ్ లపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
హైపర్ ఆది, రష్మీ గాలి చిరుగాలి రీమిక్స్ పాటకు స్టెప్పులు వేస్తారు.
వెళ్లొచ్చా.? అయిపోయిందా నీ కోరిక.? అని రష్మీ ఆదిని అడుగుతుంది.ఆ తర్వాత ఆది అయిపోయిందని లేకపోతే మళ్లీ వేరే క్యారెక్టర్ ఉంది వాటికి మీరెందుకు.? అని మంచాన్ని చూపిస్తాడు.హైపర్ ఆది వేసిన పంచ్ కు రష్మీ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది.
ఆ తరువాత నేను చేసుకోబోయే అమ్మాయి శిల్పంలా ఉండాలని ఆది చెప్పగా శాంతకుమార్ లేడీ గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు.
శాంతకుమార్ ను చూసిన హైపర్ ఆది మంచం కిందకు వెళ్లి దాక్కుంటాడు.ఆ తరువాత శాంతకుమార్ వేసిన పంచ్ కు హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతాడు.ప్రోమో చివరలో సుధీర్, రష్మీ తో సాయంత్రం పాటకు స్టెప్పులు వేయగా ఆ సాంగ్ ప్రోమోకు హైలెట్ అయింది.
అయితే ఆది పంచ్ లపై కొంతమంది నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు గత కొన్నివారాలుగా కొన్ని కారణాల వల్ల ఎక్స్ట్రా జబర్దస్త్ కు హాజరు కాని గెటప్ శ్రీను ఎంట్రీ ఇచ్చారు.ఈ నెల 18వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది.