తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో పల్లె.పట్నం ప్రాంతాలలో జరుగుతున్న ప్రభుత్వ పనులను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఎక్కడా కూడా అవినీతి లేకుండా పనులు ఏ రీతిలో ఎక్కడ దాకా ఉన్నాయి.పరిపాలన ఏవిధంగా ప్రజలకు అందుతుందో అనేదాన్ని స్వయంగా కేసీఆర్ ఆయా నియోజకవర్గాలకు వెళ్లి సమీక్షించనున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
కరోనా నేపథ్యంలో చాలా వరకు నాయకులు ప్రజలకు దూరం అయిన నేపథ్యంలో ఈ కార్యక్రమంతో మరింతగా.పార్టీ నేతలు ప్రజలకు దగ్గర అయ్యేవిధంగా కేసీఆర్.ఈ కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం.
ఈ రీతిగా ప్రజల వద్దకు వెళ్ళి.వారి కష్ట నష్టాలను కూడా తెలుసుకునే రీతిలో కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలలో టాక్.
ఏదేమైనా చాలా కాలం తర్వాత ప్రజలలోకి కేసీఆర్ వస్తున్నట్లు వార్తలు రావడం మాత్రమే కాక మరో పక్క జరుగుతున్న పనులను దగ్గరుండి కేసీఆర్ తనిఖీలు చేయాలనే ఆలోచన రావటంతో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులలో కదలిక మొదలైనట్లు సమాచారం.