స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అవుతోంది.ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ రెండు భాగాల షూటింగ్ను కంటిన్యూగా జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కానీ బన్నీ మాత్రం పుష్ప తొలి భాగం రిలీజ్ అయ్యాక, కొంత గ్యాప్ తీసుకోవాలని చూస్తున్నాడట.ఈ గ్యాప్లో ఆయన మరో పాన్ ఇండియా మూవీ ఐకాన్ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఈ సినిమాకు సంబంధించి గతంలోనే అనౌన్స్ చేసిన బన్నీ, ఇప్పటివరకు మరే అప్డేట్ను ఇవ్వలేదు.దీంతో జనం ఈ సినిమా గురించి మరిచిపోయారు.అయితే ఇప్పుడు పుష్ప రెండు భాగాల మధ్యలో ఐకాన్ను బన్నీ పూర్తి చేయాలని చూడటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఐకాన్ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేసే పనిలో పడ్డాడు.దీంతో ఐకాన్ చిత్రాన్ని మరో డైరెక్టర్ తెరకెక్కిస్తాడని చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.
మరి బన్నీతో ఐకాన్ చిత్రాన్ని తెరకెక్కించే ఆ డైరెక్టర్ ఎవరనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.ఇక పుష్ప చిత్రంలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.