యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యూవీ క్రియేషన్స్ ఇప్పటి వరకు రెండు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది.
పూజా హెగ్డే ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది.ఇక రొమాంటిక్ లవ్ డ్రామాగా పీరియాడిక్ జోనర్ లో పారిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో రెండేళ్ళ క్రితమే స్టార్ట్ అయిన కూడా కరోనా ప్రభావం ఎప్పటికప్పుడు షూటింగ్ పై పడుతూ వస్తుంది.ఈ కారణంగా గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది.
దీంతో బడ్జెట్ కూడా అనుకున్నదానికంటే పెరిగిపోయింది.
అయితే ప్రభాస్ మార్కెట్ పరంగా చూసుకుంటే రెండు వందల కోట్లు సేఫ్ జోన్ అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.ముగింపు దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది.
మళ్ళీ షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వగానే సెట్స్ పైకి వెళ్ళడానికి దర్శకుడు రాధాకృష్ణ రెడీ అవుతున్నాడు.దీనికి కారణం ఇంకా ఈ షూటింగ్ బ్యాలెన్స్ పది రోజులు మాత్రమే ఉంది.
పది రోజుల్లో మిగిలిన భాగం అంతా ఫినిష్ చేసి గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అవుతున్నారు.ఇక రాధేశ్యామ్ షూటింగ్ ముగియగానే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ అవుతారు.
ఆ మూవీ కూడా హైదరాబాద్ లో ఆర్ఎఫ్సీలో షూట్ చేయడానికి దర్శకుడు ఓం రౌత్ రెడీ అయ్యారు.దానికి కావాల్సిన గ్రీన్ మ్యాట్ స్టూడియోని కూడా సిద్ధం చేస్తున్నారు.