గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జోడీగా రొమాంటిక్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.
ఇక రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.అయితే కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్స్ మూతపడటంతో సినిమా వాయిదా పడిపోయింది.
ఇక సుకుమార్ కథతో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ మూవీ కూడా గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో తెరకెక్కింది.ఈ మూవీలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించారు.
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని కూడా ఆవిష్కరించారు.ఈ మూవీ కూడా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాల రిలీజ్ పై నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు.థియేటర్స్ ఓపెనింగ్ కోసం మరో రెండు నెలలు వెయిట్ చేస్తామని ఆగష్టు నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ డిజిటల్ రిలీజ్ కి వెళ్లిపోతామని స్పష్టం చేశారు.
అలాగే 18 పేజెస్ మూవీ ఇంకా కొంత షూటింగ్ ఇంకా 10 రోజులు పెండింగ్ లో ఉందని చెప్పారు.షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మూవీని కూడా థియేటర్ రిలీజ్ కోసం ఓ రెండు నెలలు వెయిట్ చేస్తామని, కుదరదరు అనుకుంటే ఒటీటీకి వెళ్లిపోతామని స్పష్టం చేశాడు.
ప్రస్తుత పరిస్థితిలో అంతకు మించి ఆప్షన్ కూడా లేదని కూడా బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు.అయితే ఈ రెండు సినిమాలో కొద్దిగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కినవి కావడంతో ఎక్కడైనా హిట్ టాక్ తెచ్చుకుంటాయనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది.
ఈ కారణంగా బన్నీ వాస్ ఒటీటీ రిలీజ్ కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారని టాక్ నడుస్తుంది.