యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన ప్రభాస్, ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే మాస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ అనే సినిమాలో నటిస్తున్న ప్రభాస్, ఆ తరువాత బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ అనే సినిమాను కూడా చేస్తున్నాడు.ఇక మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు ప్రభాస్.
అయితే బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంపై కేవలం దక్షిణాది ప్రేక్షకుల్లోనే కాకుండా యావత్ ఇండియన్ సినిమా లవర్స్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.రామాయణం ఆధారంగా ఈ సినిమా రానుండగా, ఇందులో భారీ తారాగణం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.కాగా ప్రభాస్ మాత్రం ఇంకా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాలేదు.అయితే ఆదిపురుష్ తొలి షెడ్యూల్ను ముంబైలో చిత్రీకరించిన చిత్ర యూనిట్, రెండో షెడ్యూల్ను హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నారు.కాగా ఈ రెండో షెడ్యూల్లో కూడా ప్రభాస్ జాయిన్ కావడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ చిత్ర షూటింగ్ను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకే ఆదిపురుష్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యేసరికి సలార్ చిత్రాన్ని పూర్తి చేసి, ఆ తరువాత ఆదిపురుష్ చిత్రంలో జాయిన్ కావాలని ప్రభాస్ భావిస్తున్నాడు.
ఏదేమైనా ప్రభాస్ లేకుండానే ఆదిపురుష్ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.ఇక ఆదిపురుష్ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.