తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి నెలకొంది.గమ్యం ఎటు గమనం ఎటు అనేది కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా స్పష్టత లేకుండా ఉన్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పటికే అన్ని రకాల ఎన్నికలలో కూడా చతికిల పడ్డ కాంగ్రెస్ ఏ మాత్రం సత్తా చాటకుండానే ఓటమి పాలవుతోంది.అయితే ఇప్పటికే పటిష్టమైన నాయకత్వం లేక కాంగ్రెస్ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్న పరిస్థితిలోఅప్పట్లో పీసీసీ మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డ పరిస్థితి ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పీసీసీ చీఫ్ ఎంపిక పట్ల తీవ్ర పోటీ నడిచింది.చివరకు ఎటువంటి నిర్ణయం వెలువరించకుండానే పీసీసీ చీఫ్ ఎంపిక నిర్ణయం అన్నది వాయిదా పడింది.
ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున ఆలస్యమైన పరిస్థితులలో కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని మిగతా పార్టీలు ప్రచారం చేస్తున్న వేళ కాంగ్రెస్ నాయకులు పెద్దగా స్పందించకపోగా పటిష్టమైన నాయకత్వం కొరకు ఏ ఒక్కరూ సహకరించుకోకపోవడమే ఇప్పుడు కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. మరి పీసీసీ చీఫ్ ఎంపిక నిర్ణయాన్ని ఇంకెన్నాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్ నాన్చుతుందనేది ఇప్పడు ఉత్కంఠగా మారింది.లేకపోతే కాంగ్రెస్ కు కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
తాజా వార్తలు