టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.తన అందచందాలతో కుర్రకారు మదిలో తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ లో తన కెరీర్ న ప్రారంభించి తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.నాగ చైతన్యతో కలిసి సవ్యసాచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే మొదటి సినిమా ఈ బ్యూటీ కి అంత పేరు తెచ్చిపెట్టలేదు.
ఇక రెండవ సినిమా అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది.
అయితే ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీ అసలు అన్ని గల్లంతు అయ్యాయి.తనకు ఇంకా అవకాశాలు రావు అనుకుంటున్నా సమయంలో చాలా గ్యాప్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ మన ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మొదటి రెండు సినిమాల్లో కంటే కాస్త భిన్నంగా కనిపించింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన గ్లామర్ మొత్తం బయటకు తీసింది.పూరీ టేకింగ్ కూడా నిధి అగర్వాల్ కు ప్లస్ అయ్యింది.ఈ సినిమాతో తన కెరీర్ లో మొదటి హిట్ అందుకుంది.
ఈ సినిమా ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడంతో ఈ బ్యూటీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అయితే ఇంకా ఈ బ్యూటీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేక పోయింది.
కానీ ఇప్పుడు యూట్యూబ్ లో మాత్రం నిధి అగర్వాల్ రికార్డ్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి.ఆమె చేసిన తెలుగు సినిమాలన్నీ యూట్యూబ్ లో హిందీ డబ్ అవుతున్నాయి.ఈ సినిమాలు మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.ఈమె నటించిన సవ్యసాచి 130 మిళియన్స్ క్రాస్ చేయగా, మిస్టర్ మజ్ను సినిమా 200 మిలియన్ వ్యూస్ సాధించింది.
అంతేకాకుండా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏకంగా 202 మిలియన్ వ్యూస్ సాధించి ముందు వరసలో ఉంది.మొత్తానికి థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయినా యూట్యూబ్ లో మాత్రం రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.