సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభించిన వెంటనే కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిపి వేయాల్సి వచ్చింది.ఎట్టకేలకు సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ పునః ప్రారంభించారని.
రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో షూట్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కరోనా ఈ రేంజ్ లో ఉన్న సమయం లో మహేష్ బాబు సర్కారు వారి పాట ఎలా మొదలు పెట్టాడంటూ కొందరు విమర్శలు ప్రారంభించారు.
లాక్ డౌన్ అమలు లో ఉన్న ఈ సమయంలో షూటింగ్ ను మొదలు పెట్టడం ఏంటీ.మినిమం బాధ్యత ఉండక్కర్లేదా అంటూ కొందరు నెట్టింట ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు.
దాంతో చిత్ర యూనిట్ సభ్యులు స్పందించారు.షూటింగ్ ప్రారంభించినట్లుగా వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అంటూ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేయడం జరిగింది.
చిత్ర యూనిట్ సభ్యులు ఇచ్చిన నోట్ లో.మేము ఎప్పుడైతే సర్కారు వారి పాట షూటింగ్ పునః ప్రారంభం అవుతుందో అప్పుడు స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాం.అప్పటి వరకు మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దంటూ పేర్కొన్నారు.షూటింగ్ ప్రారంభించే వరకు పూర్తిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మేము ఉంటాం.మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.సర్కారు వారి పాట చిత్రీకరణ వచ్చే నెలలో పునః ప్రారంభం అవుతుందనే అభిప్రాయంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.
మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా కు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీస్ మరియు 14 రీల్స్ వారు నిర్మిస్తున్నారు.సహ నిర్మాతగా మహేష్ బాబు వ్యవహరిస్తున్నాడు.