సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా తొలిసారి శ్రీవారిని దర్శించుకున్న ఎన్.వి.రమణ...!!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ ఎన్నికైన సంగతి తెలిసిందే.తెలుగు ప్రాంతానికి చెందిన వాడు కావడంతో చాలామంది ఎన్.

 Suprem Court Chief Justice Nv Ramana Suprem Court, Nv Ramana, Supreme Court ,-TeluguStop.com

వి.రమణ చీఫ్ జస్టిస్ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడంతో మహా ద్వారం వద్ద ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

నిన్న రాత్రి స్వామి వారి ఏకాంత సేవలో పాల్గొని ఉదయం అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో ఎన్వి రమణ పాల్గొన్నారు.ఆ తర్వాత వి ఐ పి దర్శన్ లో స్వామివారిని దర్శించుకున్నరు అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటల తరువాత రేణిగుంట నుండి తిరిగి హైదరాబాద్ కి చేరుకొనున్నారు.

 దేశ ప్రధాన న్యాయమూర్తి కావటంతో ఆలయ ప్రాంగణానికి చెందిన టిటిడి సిబ్బంది మరియు అధికారులు ఎన్.వి.రమణ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube