టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.తన నటనతో మంచి సక్సెస్ అందుకుంటున్న రకుల్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సమాజంలో జరిగే విషయాల పట్ల బాగా రియాక్ట్ అవుతుంది.
ఇక పలు సోషల్ సర్వీస్ లో కూడా బాగా పాల్గొంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయం పట్ల బాగా మరిగిపోతుంది రకుల్.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హెల్త్ సీక్రెట్లు గురించి అభిమానులతో షేర్ చేసుకుంటోంది.నిత్యం వర్కవుట్ లతో ఉంటూ వాటి ఫోటోలు కూడా షేర్ చేసుకుంటుంది.
ఇక ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలకు సలహాలు కూడా ఇస్తుంది.ఇక మనేసర్ లో జరిగిన అత్యాచార ఘటన గురించి స్పందించింది రకుల్.
తాజాగా తను ఓ చానెల్ లో మాట్లాడుతూ ఇటీవలే మనేసర్ లో జరిగిన అత్యాచార ఘటన గురించి పత్రికలో చదివానని తెలిపింది.దాంతో తన రక్తం మరిగిందంటూ.
ఏం చేయాలో తనకు అర్థం కాలేదని స్పందించింది.
ఇటువంటివి జరుగుతుంటే మనల్ని మనుషులు గా పిలవాలా అనే సందేహం తనలో కలుగుతుందని తెగ మండిపోతుంది.
ఇక ప్రస్తుతం కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల వద్దకు తాను వెళ్లి సహాయం చేయాలని ఉందని తెలిపింది.కానీ తనకు ఉన్న నిబంధనల కారణంగా వెళ్ళలేకపోతున్నానని స్పందించింది.ఇక జీవితం చాలా చిన్నది అంటూ ఏ రోజు ఎవరం ఎలా ఉంటామో తెలీదని అంటుంది.
అందుకే ఉన్నంతవరకు మంచి ప్రేమతో కలిగి ఉండాలని తెలిపింది.అందరూ ఇలాంటివి తెలుసుకుంటే బాగుంటుందని స్పందించింది.ఇక రకుల్ ప్రీత్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలలో బిజీగా ఉండగా కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తుంది.