ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటినుండి కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండటం తో పాటు మరో పక్క .
వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరిగే రీతిలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈనేపథ్యంలో గతంలో కర్ఫ్యూ సడలింపు సమయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండగా దానిని రేపటినుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీనిలో భాగంగా బ్యాంకులు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పనిచేయటానికి పనివేళలు మార్చాయి.ఏపీలో రేపటి నుండి బ్యాంకు ఉదయం 10 గంటల నుండి రెండు గంటల వరకు పని చేయటానికి సిద్ధమయ్యాయి.ఇదే రీతిలో బ్యాంకుల సిబ్బంది తమ విధుల నిమిత్తం సాయంత్రం ఐదు గంటలకు వరకు బ్యాంకులో పని చేయనున్నారు.ఈ నిర్ణయాన్ని ఎస్ఎల్ బీసీ సమావేశంలో నిర్ణయించారు.