ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేపట్టడానికి కొద్ది గంటల క్రితం ప్రత్యేక విమానంలో బయల్దేరారు.ఈ పర్యటనలో సీఎం జగన్ తో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అదేరీతిలో ఎంపీ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన జగన్ కు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ ఘనస్వాగతం పలికారు.పర్యటనలో భాగంగా మొదటగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా పోలవరం పెండింగ్ నిధులకు సంబంధించి.చర్చించనున్నరు.ఆ తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం గురించి చర్చించ బోతున్నారు.రాత్రి తొమ్మిది గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో.భేటీ అయి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి.వ్యాక్సినేషన్ పంపిణీకి అనేక విషయాల గురించి చర్చించనున్నారు.
ఇక చివరిగా రైల్వే మంత్రి పియూష్ గోయల్ తో రేపు సమావేశం అయి.తిరిగి ఏపీకి చేరానున్నారు.