తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ విషయంలో ప్రజలకు ఊరట కలిగిస్తూ సరి కొత్త నిబంధనలను ప్రభుత్వం నేటి నుంచి అమలులోకి తీసుకు రావడం జరిగింది.ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు సమయం ఇవ్వటం జరిగింది.
ఇదే రీతిలో ఐదు గంటల తర్వాత చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉండటంతో ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట అదనపు సమయం ప్రభుత్వం కేటాయించింది.
మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ ఈ సరి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.
దీంతో సడలింపు సమయం నాలుగు గంటలు పెంచినట్లు అయింది.ఇదిలా ఉంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలో గతంలో ఉన్న నిబంధనలు అమలు అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
దీంతో ఈనెల 19 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండే సమయం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రకారం ఉదయం 5:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు సమయం ఇచ్చినట్లయింది.