గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు.ఈ రోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో బేటీ కాబోతున్నారు.దాదాపు రెండు రోజులపాటు పర్యటన చేపట్టనున్నారు.ఈరోజు అమిత్షాతో బేటీ ఏ రాష్ట్రంలో రాజకీయ ఇంకా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్లో ఉన్న నిధులు గురించి చర్చించనున్నట్లు సమాచారం.
అదే రీతిలో కేంద్ర జల శక్తి మంత్రి షెకావత్ తో పాటు ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ కాబోతున్నారు.
పోలవరం నిధులు విషయం అదేవిధంగా వ్యాక్సినేషన్ పంపిణీ విషయాల గురించి అదే రీతిలో విభజన హామీల అమలు జాప్యంపై వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రత్యేకంగా కేంద్రమంత్రులతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
దాదాపు రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే పర్యటన చేయనున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేయనున్నారు
.