ఈ మధ్య కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ చేసేటటువంటి పనుల కారణంగా ఇతరులు ప్రాణాలు కోల్పోతున్నారు.కాగా తాజాగా ఓ పెళ్ళైన మహిళ తన ప్రియుడితో కలిసి గదిలో మంచంపై ఎంజాయ్ చేస్తుండగా భర్త చూశాడని దారుణంగా తన భర్తని గొంతు కోసి చంపిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగర పరిసర ప్రాంతంలో రాయిస్ షేక్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివాసముంటున్నాడు.అయితే రాయిస్ షేక్ తన కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఎక్కువగా ఉద్యోగ నిమిత్తమై అప్పుడప్పుడు బయటకి వెళ్తూ వస్తూ ఉండేవాడు.దీంతో ఈ మధ్య రాయిస్ షేక్ భార్య స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ క్రమంలో తన భర్త ఉద్యోగం నిమిత్తమై బయటికి వెళ్ళిన సమయంలో వీరిద్దరూ కామ క్రీడలు సాగించేవాళ్ళు.
కాగా తాజాగా మరోమారు రాయిస్ షేక్ భార్య తన ప్రియుడితో కలిసి బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తుండగా తన భర్తకి అడ్డంగా దొరికి పోయింది.దీంతో రాయిస్ షేక్ తన భార్యపై చేతికందిన కత్తితో దాడి చేశాడు.ఈ క్రమంలో రాయిస్ షేక్ భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తని అంతమొందించింది.
అంతేగాక తన భర్త శవాన్ని వంట గదిలో పూడ్చి పెట్టింది.ఇటీవలే రాయిస్ షేక్ సోదరుడు ఇంటికి రావడంతో అనుమానం వచ్చింది.
దాంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రాయిస్ షేక్ భార్యని అదుపులోకి తీసుకొని విచారించగా తమ కామ క్రీడలకి అడ్డోస్తున్నడాని తన ప్రియుడితో కలిసి తానే తన భర్తని హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకుంది.