హిందీలో దాదాపు 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “విక్రమ్ భట్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా విక్రమ్ భట్ లవ్ ఓరియంటెడ్ మరియు హర్రర్ తరహా చిత్రాలను తెరకెక్కించడంలో మంచి దిట్టని చెప్పవచ్చు.
అయితే సినిమా జీవిత పరంగా బాగానే విజయం సాధించిన విక్రమ్ భట్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.కాగా అప్పట్లో బాలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందిన ఓ ప్రముఖ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు.
కాని వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం మరియు ఆర్థికపరమైన వ్యత్యాసం బాగా ఉండటంతో ఇరువురి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు.దీంతో విక్రమ్ భట్ అదితి భట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కానీ కానీ ఈ పెళ్లి కూడా ఎన్నో రోజులు నిలవలేదు.పెళ్లయిన కొంతకాలానికే ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో అదితి భట్ కి విడాకులు ఇచ్చాడు.
అయితే అప్పటికే వీరిద్దరికీ ఓ కొడుకు ఉన్నప్పటికీ అతడి సంరక్షణను కూడా తన భార్యకి అప్పజెప్పాడు.ఇక తన భార్య కి విడాకులు ఇచ్చినప్పటి నుంచి విక్రమ్ భట్ ఒంటరిగానే ఉంటున్నాడు.
కాగా ఆ మధ్య తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “బద్రి” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన “అమీషా పటేల్” తో కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.కానీ ఈ మధ్య అమీషా పటేల్ కూడా విక్రమ్ భట్ తో తెగతెంపులు చేసుకొని ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ విక్రమ్ భట్ తన వ్యక్తి గత జీవితంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా భార్యకు విడాకులు ఇవ్వడంతో పాటు తన ఆస్తులను కూడా కోల్పోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా ఇటీవలే మహేష్ బాబు హిందీలో హాక్డ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటిటి జి5 లో ప్రసారమవుతుంది.