టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో మరో యంగ్ స్టార్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీ లో ఉంది.
ఇక ఈ సినిమా లైన్లోనే ఉండగా మరికొన్ని అవకాశాలు అందుకున్నాడు చెర్రీ.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇందులో స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడట.ఇక ఈ సినిమా కూడా షూటింగ్ బిజీలో ఉంది.
ఇదిలా ఉంటే మరో క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలిసింది.
ఇక జెర్సీ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి తన తర్వాత సినిమాను చరణ్ తో ప్లాన్ చేశాడట.ఇదంతా ఇలా ఉంటే తాజాగా మరో డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు చెర్రీ.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు లోకేష్ కనగరాజు.వరుస ఆఫర్ లతో మంచి క్రేజ్ లో దూసుకుపోతున్న లోకేష్ తాజాగా రామ్ చరణ్ తో ఓ ప్రాజెక్టు చేయనున్నట్లు తెలిసింది.
అంతేకాకుండా ఈ సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కించాలని అనుకుంటున్నారట.
ఇక ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారట.
దీంతో డైరెక్టర్ లోకేష్ రూ.ఐదు కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.మొత్తానికి వరుస సినిమాలలో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఎటువంటి సక్సెస్ లు అందుకుంటాడో చూడాలి.