ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కానీ ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఎప్పటి నుండో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా కూడా కరోనా కారణంగా మధ్యలో వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం షూటింగ్ వాయిదా వేశారు.
మళ్ళీ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతుండడంతో సినిమా షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.
ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు నటిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను జక్కన్న అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
కానీ ఇప్పుడు ఇంకా షూటింగ్ బాలన్స్ ఉంది.అందువల్ల చెప్పిన సమయానికే వచ్చే అవకాశం లేవని అంటున్నారు.
ఇది ఇలా ఉంటె ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ సినిమాలన్నీ పక్కన పెట్టేసారు.రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత శంకర్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి అయితే కానీ శంకర్ తో మొదలు పెట్టే ఛాన్స్ లేదు.కాబట్టి రామ్ చరణ్ కోసం శంకర్ ఇంకా ఎదురు చూడక తప్పద జక్కన్న ఈ సినిమా ఇంకా ఎన్ని రోజులు చెక్కుతాడో వేచి చూడాలి
.