సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రజలకు సుపరిచితమే.టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లుక్ తో కనిపించి కుర్రకారును తనవెంట తిప్పుకుంటుంది.
సోషల్ మీడియాలో తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు రకుల్ కీలక సూచనలు చేస్తూ ఉంటారు.అయితే ఈ అమ్మడు తాజాగా కొంతమందిపై ఫైర్ అయ్యింది.
ఈ అమ్మడు దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.కానీ గత కొన్ని రోజులుగా ఈమె చేసే సినిమాలు ప్లాప్ అవ్వడంతో స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గి పోయాయి.
దీంతో ఈ అమ్మడు ఇప్పుడు కుర్ర హీరోల సరసన ఛాన్స్ లు అందుకుంటూ బిజీ హీరోయిన్ గానే గడుపుతుంది.
తాజాగా మన దేశంలో జరుగుతున్న అత్యాచారాలు గురించి రకుల్ స్పందించింది.
వార్తాపత్రికల్లో రోజు అత్యాచారాల గురించి చదువుతున్నప్పుడు రక్తం మరిగిపోతుందంటూ తెలిపారు.అసలే దేశంలో కరోనా కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇలాంటో కష్టతర పరిస్థితుల్లో కూడా మానవత్వం మరిచిపోయారా అంటూ ఫైర్ అవుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికి ఒకరు అండగా ఉండాలి కానీ ఇలా మానవత్వం లేకుండా అత్యాచారాలు చేస్తున్నారు మీరు అసలు మనుషులేనా అంటూ సూటిగా ప్రశ్నలు సంధించింది.
అందుకే మంచిగా మారాలని కోరుకుంటున్నాను.అంటూ రకుల్ తెలిపారు.
ఇది ఇలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొండపొలం సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.పరిస్థితులు చెక్కబడిన తర్వాత త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.