ఎక్ మినీ కథ మూవీతో ట్రాక్ లోకి వచ్చిన సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు.ఇప్పటికే కొత్త దర్శకుడుతో ప్రేమ్ కుమార్ అనే కామెడీ ఎంటర్టైనర్ ని స్టార్ట్ చేసేసి సగానికి పైగా పూర్తి చేసేసాడు.
అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇంతలో సంతోష్ శోభన్ మారుతి దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి ఒకే చెప్పడం, ఆల్ రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిపోయిందని తెలుస్తుంది.అయితే ఇది కేవలం వెబ్ మూవీ అని ఆహ కోసం ఈ చిత్రాన్ని మారుతి స్టార్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గానే మారుతి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు బోగట్టా.ఇదిలా ఉంటే రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం చేసుకున్న టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మెహరీన్ ఈ మూవీలో సంతోష్ శోభన్ కి జోడీగా నటించబోతుందని సమాచారం.
మహానుభావుడు లాంటి హిట్ మూవీలో తనకి అద్బుతమైన పాత్ర ఇచ్చిన మారుతి మీద అభిమానంతో ఈ మూవీ స్క్రిప్ట్ కూడా వినకుండా మెహరీన్ ఒకే చెప్పెసిందని టాక్ వినిపిస్తుంది.ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయ్యిందని నెల రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి రెండు నెలల్లో రిలీజ్ చేయడానికి మారుతి ప్లాన్ చేసుకున్నట్లు బోగట్టా.అయితే ఈ మూవీ గురించి షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఒకే సారి అప్డేట్ ఇవ్వాలని మారుతి భావిస్తున్నట్లు తెలుస్తుంది.