తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం లేటెస్ట్ గా సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తూ తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభించగా రాష్ట్రంలో జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేశారు.ఇక ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఫస్ట్ ఇయర్ లో ఇచ్చిన గ్రేడ్ ల ప్రకారమే సెకండ్ ఇయర్ గ్రేడింగ్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలతో పాటుగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేశారు.
ఏప్రిల్ నెలలోనే పదవ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తునంట్టు ప్రకటించగా జూన్ నెలలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని అనుకున్నారు.ఇక ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా రద్దు చేస్తూ విద్యార్ధులను ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
టెన్త్ తర్వాత ఇంటర్ మార్కులను బట్టె విద్యార్ధుల తమ తదుపరి విద్యా విధానాలను అనుసరించాల్సి ఉంటుంది.అయితే కరోనా కారణంగా లాస్ట్ ఇయర్ కూడా అన్ని పరీక్షలు రద్దు చేశారు.
గ్రేడింగ్ ప్రకారంగా విద్యార్ధులను పాస్ చేశారు.ఇక 2021 అకడమిక్ ఇయర్ కూడా అలానే పరీక్షలు లేకుండా విద్యార్ధులను ప్రమోట్ చేస్తున్నారు.