ఈక్వెడార్ సమీపం దగ్గర ఓ దీవిలో కైలాశ అనే దేశం ఏర్పాటు చేస్తున్న నిత్యానంద ఇండియాలో కరోనా పరిస్థితిపై స్పందించారు.ఓ శిష్యుడు ఇండియాలో కరోనా పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందని స్వామీజీని ప్రశ్నించగా తాను ఎప్పుడైతే ఇండియాలో అడుగు పెట్టడం జరుగుతుందో అప్పుడు కరోనా కంట్రోల్ అవుతుంది అని నిత్యానంద జవాబిచ్చారు.
ప్రస్తుతం మీడియాలో గత కొద్ది రోజుల నుండి కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి.
దాదాపు 5 లక్షల దాకా పాజిటివ్ కొత్త కేసులు రోజు నమోదు అయ్యే పరిస్థితి నుండి తాజాగా లక్ష కేసులకు దిగువగా ఇండియాలో కరోనా కేసులు పడిపోయాయి.
మరో పక్క కేంద్రం వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరపడానికి అన్ని ప్రణాళికలు చేస్తూ ఉంది.ఇప్పటికే వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని జూన్ 21 నుండి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కేంద్రం ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తుందని ప్రధాని తెలపడం జరిగింది.
మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు చేసుకుంటూ రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ లను మెల్ల మెల్లగా తగ్గిస్తూ వస్తున్నారు.
.