ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ వ్యవహారం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతోంది.ఆయన వరుసగా అందరికీ లేఖలు రాస్తూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు.
అయితే ఆయన రాజ్నాథ్ సింగ్ను గతంలోకలిసి తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసేందుకు ఆ హాస్పిటల్ రిజిస్ట్రార్ కేపీరెడ్డితో పాటు టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, అలాగే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి ముగ్గురు కలిసి కుట్ర చేశారని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన ఫిర్యాదులపై తన దగ్గర ఆధారాలున్నట్లు రఘురామ గతంలోనే స్పష్టం చేశారు.
కానీ దీనిపై ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి గానీ అటు గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కానీ స్పందించకపోవడం గమనార్హం.అయితే ఇప్పుడు ఇదే విషయంలో ఎంపీకి షాక్ తగిలింది.
ఎంపీ ఆరోపణలపై టీటీడీ జేఈవో ధర్మారెడ్డి ఇప్పుడు స్పందించారు.ఆయన రీసెంట్గా ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఇదే విషయంపై ఘాటుగా ప్రశ్నించారు.
తాను మే 3 నుంచి 18 తేదీల మధ్య తిరుమలలోనే ఉన్నానని, తనపై ఎంపీ రఘురామ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమన్నారు.
తనకు అసలు కేపీ రెడ్డి ఎవరో తెలియదని, పరిచయం కూడా లేదని తేల్చి చెప్పారు.ఎంపీ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చాలెంజ్ చేశారు.ఈ విషయంలో అవసరమైతే తన ఫోన్ నెంబర్ కు సంబంధించి మూడేళ్ల కాల్ రికార్డులను కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు.
మరి ఈ ఛాలెంజ్ను ఎంపీ రఘురామ స్వీకరించి, ఆధారాలతో నిరూపిస్తారా? అలా నిరూపించి ధర్మారెడ్డి ఉద్యోగాన్ని ఊడగొడతారా అనేది తేలాల్సి ఉంది.ఏదేమైనా ఎంపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి.
మున్ముందు ఇవి ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.