రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా మల్టీ స్టారర్ లతో తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఈ సినిమా అప్ డేట్ ల గురించి తెగ ఎదురు చూస్తున్నారు.
బాహుబలి రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కించాలనుకున్న రాజమౌళి ఇందులో బాలీవుడ్ హీరోయిన్స్ ను పరిచయం చేశాడు.
ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా టీజర్, పోస్టర్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉండగా అక్టోబర్ 13న విడుదల చేయాలని అనుకుంటున్నారట.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి మరింత ఎక్కువగా ఉండటంతో షూటింగ్ వాయిదా పడడం వల్ల కాస్త ఆలస్యం కావడంతో మళ్లీ ఈ సినిమాను విడుదలను వాయిదా వేశారు.ప్రస్తుతం కొన్ని షూటింగ్ పనులు ఉండగా అవి మరింత ఆలస్యం కావచ్చని సమాచారం.
ఇక ఇందులో కొన్ని క్లైమాక్స్ సన్నివేశాల్లో కీలకపాత్రల్లో కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరించాల్సి ఉండటంతో మరో ఆరు నెలల సమయం పడుతుందని తెలుపుతున్నారు.ఇక దీంతో ముందుగా అనుకున్న అక్టోబర్ 13న విడుదల చేయడానికి కుదరదని అంటున్నారు.ఇక మరోసారి విడుదల తేదీ మార్పు పై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఇక రాజమౌళి ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తే బాగుంటుందని అంచనాలు వేస్తున్నాడట.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ 900 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది.