అతి త్వరలో మొదలు కాబోతున్న శ్రీలంక, టీమ్ ఇండియా పర్యటనలో భాగంగా తాజాగా మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారైంది.ఈ సిరీస్ నేపథ్యంలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, మూడు టి-20 లు ఆడేందుకు టీమిండియా యువ బృందం శ్రీలంకకు పయనం కాబోతోంది.
ఇకపోతే ఈ యువ బృందానికి శిఖర్ ధావన్ నేతృత్వం వహించబోతున్నారు.అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా సోనీ స్పోర్ట్స్ మాత్రం వారు ప్రసారం చేయబోయే పర్యటన మ్యాచ్ లకు సంబంధించి అధికారికంగా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.
ఇందులో భాగంగా టీమిండియా శ్రీలంకలో జూలై 13, 16, 18 తేదీలలో మూడు వన్డేలు ఉండగ ఆ తర్వాత జూలై 21, 23, 25 తేదీలలో మూడు టి-20 లు ఆడనుంది.
ఇకపోతే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తోపాటు ఆగస్టు నెలలో ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే ఐదు టెస్టుల సీరీస్ కొరకు ఇప్పటికే రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్న కోహ్లీసేన ఇంగ్లాండ్ లో అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఇదే క్రమంలోనే జూలై నెలలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేపథ్యంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో టీమిండియా బృందం శ్రీలంక పయనం కాబోతోంది.
శ్రీలంక కు వెళ్లే జట్టులో శిఖర్ ధావన్ తో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, చాహల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ చాహర్, ఇషాంత్ కిషన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లు వెళ్లే అవకాశం లేకపోలేదు.అయితే పూర్తి వివరాలు బిసిసిఐ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.