కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం ఎలాంటి పరిస్థితిని ఎదురుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న, పెద్ద ,ఆ మతం, ఈ మతం అని తేడా లేకుండా ఎంతో మందిని బలితీసుకుంది ఈ కరోనా వైరస్.
ఈ నేపథ్యంలో కాస్త నిదానంగా అయినా చివరికి ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీ కరోనా వ్యాక్సినేషన్ ను తీసుకోవచ్చి కొద్దిమేర కరోనా తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.వాక్సినేషన్ వేయించుకున్న కానీ కరోనా వైరస్ అరికట్టడానికి అనేక దేశాలు ఇంకా నియమ నిబంధనలు పాటిస్తున్నాయి.
కాకపోతే కొంతమంది ఈ నియమనిబంధనలు పాటించడానికి సుముఖత చూపించడంలేదు.అధికారుల రూల్స్ ను బైక్ ఆఫర్ చేస్తున్నారు.ఇలా రూల్స్ ను గంగలో తొక్కిన సంఘటన తాజాగా ఒకటి జరిగింది.షాపింగ్ వచ్చిన సమయంలో ఓ మహిళ మాస్కు ధరించకపోవడంతో షాపు నుండి ఓ సెక్యూరిటీ గార్డ్ మహిళను బయటికి పంపించడంతో సదరు మహిళ ఆ సెక్యూరిటీ గార్డ్ పై క ఉమ్మేసింది.
ఈ సంఘటన తాజాగా లండన్ నగరంలో చోటు చేసుకుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇందుకు సంబంధించిన వీడియోలో.
ఓ లేత గోధుమ రంగు డ్రెస్ ధరించిన సదరు మహిళ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడుతున్నట్లుగా కనబడుతోంది.ఆవిడ ఆ వీడియోలో పెద్దగా తాను ఈ తప్పు చేయలేదని గట్టిగా అరవడం మనం గమనించవచ్చు.ఆవిడ మాస్క్ పెట్టుకోకుండా సదరు మాల్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో అక్కడున్న సెక్యూరిటీ గార్డులు ఆవిడకు అడ్డు చెప్పారు.
దీంతో సదరు మహిళకు, అలాగే అక్కడున్న సెక్యూరిటీ గార్డు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.దీంతో ఆ మహిళ తో పాటు వచ్చిన మరో మహిళ కలిసి అక్కడున్న సెక్యూరిటీ గార్డులను నెట్టివేయడంతో అసలు రచ్చ మొదలైంది.
ఈ సందర్భంలోనే గొడవ పడిన మహిళలు ఒక మహిళ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ పై ఏకంగా ఉమ్మి అక్కడినుంచి పరిగెత్తే ఈ ప్రయత్నం చేసింది.దీంతో రోడ్డుపై ఆమెను పట్టుకోవడానికి సెక్యూరిటీ గార్డులు కూడా పరిగెత్తారు.
దీంతో సదరు మహిళను చివరిగా పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.