నిన్న జాతినుద్దేశించి దేశ ప్రధాని మోడీ పై చేసిన ప్రసంగంలో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని తెలపటం తెలిసిందే.దీంతో వ్యాక్సినేషన్ పై వైయస్ షర్మిల తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు.
కేంద్రం ఫ్రీగా వ్యాక్సిన్ అందిస్తుంది అని ఓ ప్రముఖ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు వయస్సు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత కేంద్రం తెలిపింది.
అంత మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని ప్రకటించడం ప్రస్తావిస్తూ .కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పి సంతోషకరమని తెలిపారు.
వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా .రాబోయే థర్డ్ వేవ్ సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అందరూ ఆలోపు వ్యాక్సిన్ అందించాలని .ఏ విధంగా అయితే ఎన్నికలు వేగవంతంగా నిర్వహిస్తారో అదేరీతిలో.వ్యాక్సిన్ అందించాలని వైయస్ షర్మిల స్పష్టం చేశారు.
.