తెలుగులో పలు మాస్ మరియు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దర్శకుడు వి.వి.వినాయక్ మాస్ ఓరియెంటెడ్ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ హీరోలను పవర్ ఫుల్ గా చూపించే క్రమంలో వచ్చే సన్నివేశాలు పూర్తి చిత్రానికే హైలైట్గా నిలుస్తాయి.అయితే తాజాగా దర్శకుడు వి.వి.వినాయక్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా తను అక్కినేని హీరో అక్కినేని అఖిల్ ని సినిమా ఇండస్ట్రీ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన అఖిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని తెలిపాడు.
కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం కొన్ని చోట్ల బాగానే సాధించిందని అయితే ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా నష్టపోయారని దాంతో తన రెమ్యూనరేషన్ నుంచి కొంత డబ్బుని తీసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేశానని తెలిపాడు.
అంతేకాకుండా ఇప్పటివరకు తన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాతలు తన స్నేహితులని దీంతో మనతో పాటు మన స్నేహితులు కూడా బాగుపడడం చాలా మంచి విషయమని తెలిపాడు.ఇక ఆది చిత్రం తెరకెక్కించడానికి ముఖ్య కారణం కొడాలి నాని అని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య వి.వి.వినాయక్ తెలుగులో తెలుగు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఇంటిలిజెంట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.కాగా ప్రస్తుతం వి.వి.వినాయక్ తెలుగులో ప్రముఖ తెరకెక్కిస్తున్న సినయ్య అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల కాగా మంచి స్పందన లభించింది.