ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి థియేటర్ ఓనర్లను, డిస్ట్రిబ్యూటర్లను, నిర్మాతలను తెగ టెన్షన్ పెడుతోంది.వచ్చే నెల 1వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అవుతాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది.
అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం గతేడాదితో పోలిస్తే రెమ్యునరేషన్లను భారీగా పెంచేశారు.హీరోల కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు మిడిల్ రేంజ్ హీరో బడ్జెట్ తో సమానంగా ఉండటం గమనార్హం.
వకీల్ సాబ్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమాకు పారితోషికంగా 50 కోట్ల రూపాయలు లాభాల్లో వాటాగా 15 కోట్ల రూపాయలు తీసుకోవడం గమనార్హం.పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటుండగా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఒక్క సినిమా హిట్టైనా ప్రభాస్ రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసే అవకాశాలు ఉన్నాయి.
గతంలో పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకున్న మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు మాత్రం 50 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నట్టు భోగట్టా.పుష్ప పార్ట్ 1కు తక్కువ మొత్తమే పారితోషికం తీసుకున్న అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2కు మాత్రం 50 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది.అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్తీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకు చెరో 35 కోట్ల రూపాయలు తీసుకున్నారు.
ఆర్ఆర్ఆర్ రిజల్ట్ ను బట్టి ఈ హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ ను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి.సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైతే భారీ రెమ్యునరేషన్లు ఇచ్చినా నిర్మాతకు నష్టం రాదు కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని చెప్పవచ్చు.