ప్రేమదేశం సినిమా తో మంచి సక్సెస్ అందుకున్న హీరో వినీత్.మరో హీరో అబ్బాస్ తో కలిసి నటించగా ఈ సినిమా తమకు మంచి గుర్తింపు అందించింది.
తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించాడు.తన నటనకు మంచి పేరు అందుకున్నాడు.ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన వినీత్ మళ్లీ తెలుగు సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట.
1985లో ఐ.వి శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇదనిలంగ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వినీత్ ఆ తర్వాత పలు భాషల్లో వరుస సినిమాలతో అవకాశాలు అందుకున్నాడు.ఇక చివరి సారిగా చంద్రముఖి సినిమా లో నటించిన ఈయన ఆ తర్వాత కోలీవుడ్ లో బిజీ గా మారాగా.
తెలుగులో అవకాశాలు అందుకోలేదు.
కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించాడు.
ఇక ఇటీవలే ఈ ఏడాది హీరో నితిన్, కీర్తి సురేష్ నటించిన రంగ్ దే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు రీ ఎంట్రీ ఇచ్చాడు వినీత్.ఇక ఇందులో కీర్తి సురేష్ కు సోదరుడి పాత్రలో నటించాడు.ఈ సినిమాలో ఈయనలో ఎటువంటి మార్పు కనిపించలేదని అభిమానులు తెలిపారు.ఇక మొత్తానికి ఈ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన వినీత్ కు పలువురు దర్శక నిర్మాతలు ఆయన కోసం సంప్రదిస్తున్నారని తెలిసింది.
ఇక వినీత్ కూడా టాలీవుడ్ సినిమాల పై ఆసక్తి చూపగా ఇక్కడ వరుస సినిమాలను చేయాలనే ఉద్దేశం లో ఉన్నాడట.అంతేకాకుండా తెలుగు భాషపై కూడా కాస్త పట్టు సాధించాడని తెలిసింది.ఇప్పటికే ఎంతోమంది నటులు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వగా మంచి సక్సెస్ ను అందుకుంటున్నారు.ఇక వినీత్ కూడా రీ ఎంట్రీ తో కీలక పాత్రల్లో నటించాలని అనుకోగా ఎటువంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.