నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.గత కొన్ని రోజులుగా హిట్స్ లేక బాధపడుతున్న బాలయ్య ఇప్పుడు ఈ సినిమాపై ధీమాగా ఉన్నాడు.
ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.ఇప్పుడు అఖండ సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.బాలయ్య ఈ సినిమాలో ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో కనిపించాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాను ఫారెస్ట్ లో చిత్రీకరించారు.ఆ సమయంలో అఖండ టీమ్ చేసిన అడ్వెంచర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.దండేలి అడవుల్లో షూటింగ్ జరుగుతున్నా సమయంలో చిత్ర యూనిట్ ఎన్నో అడ్వెంచర్స్ చేసారని తెలుస్తుంది. బాలయ్య ప్రగ్య తో కలిసి బోలెడన్ని సాహసాలు చేశారట.ఇప్పుడు వాటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడు కుంటున్నారు.
ఈ అడవుల్లో ఒక షెడ్యూల్ మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఇక్కడ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెకెక్కించార .ఇవి ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ అనధికారికంగా చెబుతున్న మాట.స్టాంట్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో జరిగిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కోసం నటీనటులు చాలా రిస్కులు చేశారట.చూడాలి మరి ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తుందో.