బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు ఇండస్ట్రీలో ఎంతలా వినిపించిందో అందరికీ తెలిసిందే.గత ఏడాది సుశాంత్ సింగ్ ముంబైలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా అప్పటినుండి ఇప్పటివరకు ఆయన ఆత్మహత్య గురించి దర్యాప్తు జరుగుతూనే ఉంది.
ఇక మొదట్లో ఈయన మరణం గురించి పలు దర్యాప్తు చేయగా అందులో డ్రగ్స్ కేసు కలకలంరేపింది.
ఇక ఈ నేపథ్యంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు బయటపడగా ఆమెతో పాటు మరో తొమ్మిది మందిని కూడా ఎన్ సీ బీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అందులో రియా చక్రవర్తి 28 రోజుల పాటు అరెస్ట్ అవగా ఆ తర్వాత బయటకు వచ్చింది.ఇక ఆ సమయంలో ఆమె ఛార్జిషీటులో చెప్పిన కొన్ని నిజాలు తెలుపగా.
సుశాంత్ కు మాదకద్రవ్యాల అలవాట్లు ఉన్నాయని తెలిపింది.అంతే కాకుండా అతనితో డేటింగ్ చేశానని తెలిపింది.
అతనితో రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలపగా.సుశాంత్ చావడానికి ముందు అతన్ని విడిచి వెళ్లినట్లు తెలిపింది.ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ ఆమె కొన్ని విషయాలను బయటపెట్టింది.
మరో బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా ఇందులో ఓ భాగమని తెలిపింది రియా చక్రవర్తి.
తనకు కూడా గంజాయి అందించిందని తెలిపింది.
పైగా వోడ్కా ను కూడా ఆఫర్ చేసిందట.ఇక తాను 2017 లో జూన్ 4న సారా అలీ ఖాన్ తో చాటింగ్ చేసిందట.అంతేకాకుండా తన దగ్గర చేతి చుట్టే గంజాయి చుట్టలు కూడా వద్ద ఉన్నాయని పైగా ఆమె కూడా వాటిని వాడినట్లు తెలిపింది రియా.
సారా అలీ ఖాన్ కూడా సుశాంత్ సింగ్ తో కలిసి ఓ సినిమాలో నటించింది.