ఏపీలో ఇప్పుడు టీడీపీకి, వైసీపీకి తగ్గ పోరు నడుస్తోంది.ఏ చిన్న విషయం దొరికినా దానిపై ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందుపై కూడా ఇరు పార్టీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.ఆనందయ్య మందు చుట్టూ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి, టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఆనందయ్య మందును ఓ వెబ్సైట్ ద్వారా అమ్మి రూ.120కోట్లు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే చూస్తున్నారంటూ సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
అయితే దీనిపై ఎమ్మెల్యే కాకాణి కూడా గట్టిగానే కౌంటర్ వేశారు.రాజకీయా లబ్ధి కోసమే సోమిరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే విమర్శించారు.అంతే కాదు సదరు వెబ్ సైట్ శేశ్రితా టెక్నాలజీ వెబ్ సైట్ ఎండీ ఏకంగా సెమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ ఫిర్యాదు ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం మాజీ మంత్రి సోమిరెడ్డిపై పోలీసులు పలు కేసులను నమోదు చేశారు.
ఇందులో పోర్జరీ, దొంగతనం లాంటి చట్టాల కింద కేసులు బుక్ చేశారు పోలీసులు.
అయితే ఈ వెబ్సైట్ ఓనర్లు కూడా ఎమ్మెల్యే కాకాణికి దగ్గరి బంధువులని తెలుస్తోంది.ఇక ఈ విషయంలో ఆనందయ్య కూడా స్పందించారు.దీన్ని రాజకీయం చేయొద్దని, తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ కోరారు.
అయితే ప్రభుత్వం త్వరలోనే దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.సోమిరెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్గత సమాచారం.
దీనిపై సోమిరెడ్డి కూడా గతంలో మాట్లాడుతూ తాను జైలుకు వెళ్లేందుకు ఎప్పుడైనా రెడీ అంటూ తనపై జరిగి దాడి గురించి హింట్ ఇచ్చేశారు.మరి జగన్ ప్రభుత్వం దీనిపై ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.