కార్తీకదీపం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ప్రేమీ విశ్వనాథ్ సీరియల్ లో ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఈ సీరియల్ ప్రసారమవుతుండగా సీరియల్ లో వంటలక్క పాత్ర పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
అయితే రియల్ లైఫ్ లో మాత్రం వంటలక్క పూర్తి భిన్నంగా ఉంటారు.ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.
అయితే వంటలక్క లైవ్ లోనే తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనల వల్ల చాలా సీరియళ్ల షూటింగ్ ఆగిపోయినా కార్తీకదీపం సీరియల్ షూటింగ్ మాత్రం తక్కువ మందితో జరుగుతోందని సమాచారం.
కార్తీకదీపం సీరియల్ లోని అన్ని పాత్రలు ప్రేక్షకుల మెప్పు పొందగా సుమక్కతో కలిసి ప్రేమీ విశ్వనాథ్ కలిసి లైవ్ లోకి వచ్చారు.కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తరచూ తాను కరోనా పరీక్షలు చేయించుకుంటున్నానని ప్రేమీ విశ్వనాథ్ వెల్లడించారు,/br>.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో బయటకు రావడం తన తండ్రికి అస్సలు ఇష్టం లేదని ప్రేమీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.తెలంగాణకు, కేరళకు షూటింగ్ ల కోసం తిరగాల్సి వస్తోందని ప్రేమీ విశ్వనాథ్ అన్నారు.తండ్రి తన విషయంలో బాధ పడుతున్నారని ప్రేమీ విశ్వనాథ్ పేర్కొన్నారు.తాను ఇంటికి చేరుకుని స్నానం చేసి తండ్రి ముందు కూర్చున్న తరువాతే ఆయన టెన్షన్ తగ్గుతుందని ప్రేమీ విశ్వనాథ్ వెల్లడించారు.
లైవ్ షోలోనే ప్రేమీ విశ్వనాథ్ కన్నీళ్లు పెట్టుకుంటూ తాను ఈ విధంగా ఏడవటం ఇదే మొదటిసారి అని ప్రేమీ విశ్వనాథ్ చెపుకొచ్చారు.తాను కార్తీకదీపం సీరియల్ మినహా బయట ఎక్కడా ఏడవనని ప్రేమీ విశ్వనాథ్ తెలిపారు.మరోవైపు కార్తీకదీపం సీరియల్ ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.మరో రెండేళ్ల వరకు ఈ సీరియల్ కు శుభం కార్డు పడే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.