1.ట్విట్టర్ కు కేంద్రం వార్నింగ్
సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది.
నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇంకా భారత్ లో అధికారులను నియమించకపోవడం పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే చివరి హెచ్చరిక అంటూ నోటీసులు జారీ చేసింది.
2.కోవాగ్జిన్ దిగుమతికి బ్రెజిల్ ఆమోదం
ఇండియాకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాలను బ్రెజిల్ దిగుమతి చేసుకోబోతోంది.ఈ మేరకు బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ శాఖ ప్రకటన చేసింది.
3.ట్రంప్ ఖాతాపై ఫేస్ బుక్ రెండేళ్ల నిషేధం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాపై ఫేస్ బుక్ పై రెండేళ్ళ పాటు నిషేధం విధించింది.
4.ఏపీలో భారీగా ఐఎఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు.ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
5.10 పరీక్షలను రద్దు చేసే ప్రసక్తే లేదు
పదో తరగతి పరీక్షలను రద్దు చేసే ప్రసక్తే లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
6.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,20,529 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.ప్రధాని మోదీ కి రఘురామ లేక
వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
8.ఏపీ సి ఐ డి కి వైసీపీ ఎంపీ లీగల్ నోటీసులు
ఏపీ సి ఐ డి అడిషనల్ డీజీ సునీల్ కుమార్ కు రఘురామకృష్ణంరాజు నోటీసు పంపారు.తన అరెస్టు సమయంలో పోలీసు తీసుకున్న ఐఫోన్ ను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులో ఎంపీ పేర్కొన్నారు.
9.సీబీఎస్సీ ఫలితాల కోసం కమిటీ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థుల విద్యా సామర్ధ్యం గుర్తింపు పాటించాల్సిన మార్గదర్శకాల కోసం 13 మందితో ఓ కమిటీని నియమించారు.
10.భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఏపీలో మరోసారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
11.జగన్ ఈడీ కేసు విచారణ 22కి వాయిదా
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసుల విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు ఈనెల 22 కి వాయిదా వేసింది.
12.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నిన్న స్వామివారిని 8,799 మంది భక్తులు దర్శించుకున్నారు.
13.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 10,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.చిరుత పులి దాడి నాలుగేళ్ల బాలిక మృతి
జమ్మూ కాశ్మీర్ లోని బుధ్గం జిల్లాలో చిరుత పులి దాడి చేసిన ఘటనలో నాలుగేళ్ల బాలిక మృతి చెందింది.
15.చిలీ దేశం లో భూకంపం
చిలీ దేశంలో భూకంపం ఈరోజు ఉదయం సంభవించింది.రిక్టార్ స్కేల్ పై 5.4 గా ఇది నమోదయింది.
16.నైజీరియా ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్విట్టర్ పై నైజీరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ట్విట్టర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది.
17.కోవిడ్ విషయంపై రాహుల్గాంధీ కామెంట్స్
పేపర్ కర కర పరిస్థితులను ఎదుర్కోవడం కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
18.టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్
మహబూబాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మెగాస్టార్ చిరంజీవి కి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కు ఆక్సిజన్ బ్యాంకు ను ఇచ్చిన విషయాన్ని చిరంజీవి ఎమ్మెల్యేకు చెప్పారు.
19.ఎవరెస్ట్ ఎక్కిన విశాఖ యువకుడు
విశాఖకు చెందిన భూపతి రాజు అన్మిష్ వర్మ (28) ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అవరోహించాడు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,950
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,950.