జగన్ కేసుకు సంబంధించి సీబీఐ పై టీడీపీ నేత కీలక కామెంట్స్..!!

జగన్ కేసుల విషయంలో సీబీఐ విచారణ ముమ్మరం చేయాలని ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యాయస్థానంలో పిటిషన్ వేయడం దాన్ని సీబీఐ కోర్టు స్వీకరించడం తెలిసిందే.జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి త్వరగా విచారణ చేయాలని .

 Tdp Leader Makes Key Comments On Cbi In Jagan Case Tdp, Cbi, Varla Ramaiah-TeluguStop.com

కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది.ఈ నేపథ్యంలో పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఇటీవల కౌంటర్లు దాఖలు చేయాలని జగన్ కి అదేవిధంగా సిబిఐకి నోటీసులు పంపటం తెలిసిందే.

ఈ క్రమంలో జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీలు కౌంటర్లు దాఖలు చేయడం జరిగింది.ఇదే క్రమంలో సీబీఐ సంస్థ తటస్థంగా వ్యవహరిస్తూ కోర్టుకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అన్నట్టు వ్యవహరించింది.

ఇలాంటి తరుణంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి టిడిపి నాయకుడు వర్ల రామయ్య అసహనం వ్యక్తం చేశారు.చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు.

పేదవారికి ఒకలాగా ధనవంతులకు ఒకలా అదే రీతిలో అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే మరోలా కాకుండా అందరికీ చట్టం సమానమే అని కామెంట్ చేసిన వర్ల రామయ్య జగన్ విషయంలో మాత్రం సీబీఐ చాలా విచిత్రంగా వ్యవహరిస్తుంది అని ఆరోపించారు.న్యాయస్థానాల వాయిదాలకు జగన్ హాజరు కాకపోయినా గానీ న్యాయస్థానం ఇప్పటివరకు ఏం మాట్లాడలేదని పేర్కొన్నారు.

ఆయన కేసులకు సంబంధించి విచారణ సరిగ్గా జరగకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు.మరి చట్టం అందరికి ఒకలా ఉంటే జగన్ విషయంలో మరొకలా వ్యత్యాసం ఎందుకో అంటూ అసహనం వ్యక్తం చేస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య కీలక కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube