చిరంజీవి మనస్సు ఎవరికుంటుంది.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో పరిమిత సంఖ్యలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.చాలాకాలం తర్వాత మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తుండగా నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Mohan Babu Made Interesting Comments On Chiranjeevi And Suriya, Chiranjeevi Grea-TeluguStop.com

టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ పై ఆసక్తి చూపించారు.ఈ టీజర్ కు ఇప్పటివరకు 15 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

అయితే టీజర్ రిలీజైన తరువాత చిరంజీవి గొప్పదనం గురించి చెబుతూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.మోహన్ బాబు తన శైలిలో డైలాగులు చెబుతూ 52 సెకన్ల నిడివి ఉన్న టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు.

మోహన్ బాబు టీజర్ గురించి మాట్లాడుతూ సినిమా ప్రారంభంలో వాయిస్ ఓవర్ కావాల్సి వస్తే మంచు విష్ణు చిరంజీవి పేరును తనకు సూచించారని మోహన్ బాబు అన్నారు.

ఆ తరువాత వాయిస్ ఓవర్ కోసం చిరంజీవికి ఫోన్ చేసి 10 రోజుల్లో వాయిస్ ఓవర్ కావాలని చెప్పగా చిరంజీవి మూడు రోజుల్లో సొంతంగా డబ్బింగ్ థియేటర్ బుక్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చాడని మోహన్ బాబు పేర్కొన్నారు.చిరంజీవి అంత గొప్ప మనస్సు ఎవరికి ఉంటుందంటూ మోహన్ బాబు కామెంట్లు చేశారు.చిరంజీవి యొక్క సహృదయతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నానని మోహన్ బాబు వెల్లడించారు.

టీజర్ రిలీజ్ చేయాలని సూర్యను కోరగా సూర్య విష్ణుతో మాట్లాడి ప్లాన్ చేస్తానని చెప్పి చెప్పిన టైమ్ కు టీజర్ రిలీజ్ చేశారని మోహన్ బాబు వెల్లడించారు.మోహన్ బాబు సూర్యకు ధన్యవాదాలు తెలిపారు.

విష్ణు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube