బుల్లితెరపై గడిచిన మూడు సంవత్సరాల నుంచి ప్రసారమవుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటనే సంగతి తెలిసిందే.రోజులు గడుస్తున్నా ఈ సీరియల్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది.
హీరోయిన్లకు సైతం పోటీనిస్తూ ప్రేమీ విశ్వనాథ్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు.వంటలక్కకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది.
అయితే వంటలక్కకు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కార్తీకదీపం డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర కారణం.ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తూ కాపుగంటి రాజేంద్ర సీరియల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచుతున్నారు.
తాజాగా ప్రేమీ విశ్వనాథ్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్రతో దిగిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అయితే డైరెక్టర్ గురించి కొందరు పాజిటివ్ కామెంట్లు చేస్తుంటే మరి కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
కొందరు ఫ్యాన్స్ ఈ సీరియల్ ను అభిమానంతో చూస్తే మరి కొందరు ఫ్యాన్స్ తిట్టుకుంటూ ఈ సీరియల్ ను చూస్తున్నారు.కొందరు నెటిజన్లు కార్తీకదీపం సీరియల్ తీస్తున్న మహానుభావుడివి నువ్వేనా సామీ.? అని కామెంట్లు పెడుతుంటే మరి కొందరు మోనిత ప్రెగ్నెంట్ అయితే రేటింగ్స్ పడిపోతాయంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బుల్లితెరపై కార్తీకదీపం లాంటి హిట్ సీరియల్ తీసిన ఈ డైరెక్టర్ కొన్ని సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.
కాపుగంటి రాజేంద్ర డైరెక్షన్ లో గతంలో అందం బంగారు బొమ్మ అనే సీరియల్ తెరకెక్కింది.ఈయన డైరెక్షన్ లో రాంబాబు గాడి పెళ్లాం, శివ్ శంకర్ అనే సినిమాలు కూడా వచ్చాయి.
అయితే ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈయన సీరియళ్లపై దృష్టి పెట్టారు.వెండితెరపై డైరెక్టర్ గా సక్సెస్ రాకపోయినా బుల్లితెరపై ఈ డైరెక్టర్ కు సక్సెస్ రావడం గమనార్హం.