1.ఈటెల రాజేందర్ రాజీనామా
ఎమ్మెల్యే పదవికి, టిఆర్ఎస్ సభ్యత్వానికి టిఆర్ఎస్ మాజీమంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేశారు.
2.భారత్ లో కరోనా
దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 1,32,364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.బ్లాక్ లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు
బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.ఒక్కో ఇంజక్షను 30 వేలకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
4.లాసెట్ దరఖాస్తు గడువు పొడగింపు
మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ ఎల్ బి, రెండేళ్ల ఎల్ ఎల్ ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన లా సెట్, పి జి ఎల్ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు లాసెట్ తెలంగాణ కన్వీనర్ జి బి రెడ్డి తెలిపారు.
5.ఆర్జేసీ సెట్ రద్దు
కరోనా నేపథ్యంలో గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశానికి నిర్వహించాల్సిన టీఎస్ ఆర్ జె సి సెట్ ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది.
6.గవర్నర్ తో కాంగ్రెస్ బృందం భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళ సై తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం ఈ రోజు కలవనుంది.దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు.
7.16న పోస్టల్ పెన్షన్ అదాలత్
పోస్టల్ పెన్షన్ అదాలత్ కేసుల పరిష్కారానికి పెన్షనర్లు దరఖాస్తు చేసుకోవాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సూచించారు.జులై పదహారు ఉదయం 11 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ సర్కిల్ పెన్షన్ అదాలత్ జరుగుతుందన్నారు.
8.ఆర్ జేసీ సెట్ దరఖాస్తుదారులకు ఎడిట్ ఆప్షన్
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల లోని జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే ఆర్ జె సి సెట్ కు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిని ప్రవేశాల్లో 11 లోకి తీసుకుంటామని ప్రవేశాల కన్వీనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.కొత్త దరఖాస్తులకు ఈ అవకాశం లేదని ఆయన చెప్పారు.ఈనెల 14 నుంచి 12 లోపుగా ఆన్లైన్ లో సవరించుకునే అవకాశం ఉందన్నారు.
9.ఎంసెట్ దరఖాస్తు గడువు పొడగింపు
ఎంసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించారు.ఆ తేదీ లోపుగా ఆలస్యం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఆచారి గోవర్ధన్ తెలిపారు.
10.తెలుగులోనూ కరోనా టీకా రిజిస్ట్రేషన్
కర్ణాటక రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ ఇప్పుడు హిందీ సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది.ఇందులో తెలుగు కూడా ఉంది.
11.తిరుమల సమాచారం
తిరుమల శ్రీవారి నిన్న 8839 మంది భక్తులు దర్శించుకున్నారు.
12.ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ
కృష్ణపట్నం పోర్టులో కరోనా మందు తయారు చేస్తున్న ఆనందయ్య నెల 7 నుంచి మందు పంపిణీ చేయనున్నారు.
13.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 11,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.టీకాల బాధ్యత కేంద్రానిదే
కోవిడ్ యాక్టివేషన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకునేలా అంతా ఒకే స్వరం వినిపించాలి అని ఏపీ సీఎం జగన్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.
15.ప్రధాని మోదీకి కమలా హారీస్ ఫోన్
ప్రధాని మోదీ తో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీశ్ ఫోన్ లో మాట్లాడారు.భారత్ అమెరికా సంబంధాలపై ఇరువురూ చర్చించుకున్నారు.
16.లాక్ డౌన్ పొడిగింపు
లాక్ డౌన్ పొడిగింపు పై కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నెల 14 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని ప్రకటించింది.
17.అనారోగ్యం పాలైన డేరా బాబా
డేరా సచ్చా సౌద అధినేత , వివాదాస్పద గురువు గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అనారోగ్యానికి గురయ్యారు.
18.మరో జిల్లాకు అమూల్ ప్రాజెక్ట్
అమూల్ ప్రాజెక్ట్ మరో జిల్లాకు విస్తరించింది.పశ్చిమ గోదావరి జిల్లా లో పర్చువల్ ద్వారా పాల సేకరణ కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.
19.టెన్త్, ఇంటర్ పరీక్షల పై విచారణ 30 కి వాయిదా
కరోనా విజృంభిస్తున్నా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,230 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49, 230