1.ఉచితంగా ఇంటికే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
వాళ్ళ యాప్ సర్వీస్ ద్వారా కొద్దిపాటి వివరాలు అందిస్తే ఉచితంగానే ఇంటికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఓలా ఫౌండేషన్ ద్వారా అందిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
2.తెలంగాణలో భారీ వర్షపాతం
రాబోయే 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం నాయుడు అన్నారు.
3.కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ను తాకనున్నాయి.
4.ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం
హైదరాబాద్ పర్యటనను ముగించుకుని వచ్చిన ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రారెడ్డి లకు హైదరాబాదులో అభిమానులు ఘన స్వాగతం పలికారు.
5.సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా
తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్షల కోసం నిర్వహించే ఆర్ జె సి సెట్ ప్రవేశ పరీక్షను రద్దు చేశారు.
6.లాయర్లకు లాక్ డౌన్ మినహాయింపు
న్యాయవాదులు న్యాయవాద క్లర్క్ లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.వారికి సూర్య లాక్ డౌన్ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ తెలంగాణ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
7.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.ఏపీకి చేరుకున్న కోవీ షీల్డ్ వ్యాక్సిన్లు
కోవీ షీల్డ్ వ్యాక్సిన్ లు గురువారం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు 3,60,000 డోస్ లు ఏపీకి చేరుకున్నాయి.
9.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 7635 మంది భక్తులు దర్శించుకున్నారు.
10.వైయస్సార్ జగనన్న కాలనీలకు జగన్ శంకుస్థాపన
వైయస్సార్ జగనన్న కాలనీల ప్రాజెక్టుకు ఏపీ సీఎం జగన్ నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు.
11.విజయవాడలో పాస్ పార్టీ సేవలు ప్రారంభం
విజయవాడలో పాస్పోర్ట్ సేవలను తిరిగి ప్రారంభించారు.
12.ఏపీ లో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 12,768 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.ఏపీ లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది.
14.ఆధార్ బదులు పాస్పోర్ట్
ప్రవాస భారతీయులు వ్యాక్సినేషన్ సందర్భంగా ఆధార్ బదులు పాస్పోర్ట్ నంబర్ ను నమోదు చేయించాలని ఏపీఎన్ఆర్టి అధికారి వెంకట్ మేడపాటి తెలిపారు.
15.ఏపీ మెట్రో రైలు ఎండీ రాజీనామా
ఏపీ మెట్రో రైలు ఎండీ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
16.సోను సూద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కేంద్రం ఏర్పాటు
సోను సూద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బళ్లారి రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను రైల్వే అధికారి వెంకన గౌడ్ ప్రారంభించారు.
17.2300 మంది పోలీసులకు కరోనా
ఉత్తరాఖండ్లో 2300 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
18.ఈ నెల 5 నుంచి బీజేపీ కీలక భేటీలు
భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు సమావేశాలు ఈ నెల 5,6 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరుగుతాయి.
19.ఏనుగు దాడిలో కాఫీ రైతు మృతి
కర్ణాటకలోని హసన్ జిల్లా లో ఏనుగు దాడిలో ఒక రైతు మృతి చెందారు.సకలేశ్వర పుర తాలూకా చిరుహోసనే గ్రామంలో రైతు రావన్న ( 59) ఏనుగుల దాడిలో మృతి చెందాడు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -50,400
.