రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా శాకుంతలం.ఈ సినిమా లో సమంత టైటిల్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెల్సిందే.
గుణ శేఖర్ కూతురు నీలిమ ఈ సినిమాను నిర్మిస్తుండగా దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నాడు.ఇక ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభించారు.
సాదారణంగా గుణశేఖర్ సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు పడుతుంది.కనుక శాకుంతలం సినిమా కూడా ఖచ్చితంగా కనీసం రెండేళ్లు అయినా పడుతుందని అంతా అనుకుంటున్నారు.
కాని అనూహ్యంగా దర్శకుడు గుణశేఖర్ తన పుట్టిన రోజు సందర్బంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి అయ్యిందని ప్రకటించాడు.నిజంగా ఈ విషయం అందరికి ఆశ్చార్యం కలిగించే విషయం.
శాకుంతలం సినిమా ఇటీవలే ప్రారంభించినట్లు అనిపించింది.అప్పటి నుండి కూడా కరోనా కారణంగా షూటింగ్ లు సరిగా సాగడం లేదు.అయినా కూడా శాకుతలం సినిమా ను సగం వరకు ఎలా పూర్తి చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కరోనా లాక్ డౌన్ కారణంగా గత నెల రోజులుగానే షూటింగ్ జరగడం లేదని అంతుకు ముందు వరకు షూటింగ్ సాగిందంటూ చిత్ర దర్శకుడు గుణశేఖర్ స్పష్టత ఇచ్చాడు.
లాక్ డౌన్ టైమ్ ను ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చిన కారణంగా మళ్లీ షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నాడు.సమంత కారణంగానే సినిమా స్పీడ్ గా సాగుతుందని పేర్కొన్నాడు.
పెద్ద పెద్ద సెట్స్ వేశారు.అందుకోసం భారీ గా ఖర్చు అవుతుంది.
కనుక మరింత ఆలస్యం కాకుండా స్పీడ్ గా సినిమా చేద్దాం అంటూ ఆమె స్వయంగా అనడంతో మా సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతుందని పేర్కొన్నాడు.ఈ జోరు చూస్తుంటే సినిమా వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.