పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో, ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.ఇక వకీల్ సాబ్ చిత్రం అందరూ అనుకున్నట్లుగానే భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు అభిమానులు పండగ చేసుకున్నారు.ఈ సినిమా అందుకున్న ఘనవిజయంతో పవన్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.
ఇప్పటికే వరుసబెట్టి సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతున్న పవన్, దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ఓ పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు క్రిష్ ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్టులు ఇచ్చేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ డ్యుయెల్ రోల్లో కనిపిస్తాడని చిత్రపురిలో వార్తలు వినిపించాయి.అయితే అంతకుమించిన ట్విస్టును క్రిష్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో పవన్ రెండు కాదు మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ‘హరిహర వీరమల్లు’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే ప్రారంభించగా, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షూటింగ్ వాయిదా పడింది.
త్వరలోనే తిరిగి ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించి, వీలైనంత త్వరగా ముగించేయాలని క్రిష్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.