ఈ మధ్య కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా లేనిపోని అనుమానాలకు కారణంగా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.కాగా తాజాగా ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పుదుచ్చేరి పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో రుతిక అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.ఈ క్రమంలో రుతిక భర్త కుటుంబ పోషణ నిమిత్తమై పాల వ్యాపారం చేసేవాడు.
దీంతో అర్ధ రాత్రి సమయంలో రుతిక భర్త వ్యాపార నిమిత్తమై బయటకి వెళ్లి మరుసటి రోజు మధ్యాహ్నం 12 లేదా 1:00 సమయంలో ఇంటికి వచ్చేవాడు.అయితే ఈ మధ్య కాలంలో రుతిక స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానాలు ఆమె భర్తకి మొదలయ్యాయి.
ఈ క్రమంలో తరచూ వీరిద్దరూ గొడవ పడేవారు.దీనికితోడు రుతిక భర్త వ్యాపార నిమిత్తమై బయటికి వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో తన భార్య అందంగా ముస్తాబువ్వడం మరియు ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించడం వంటి వాటి కారణంగా రుతిక భర్తకి అనుమానాలు మరింత బలమయ్యాయి.
దీంతో మరోమారు ఇద్దరు భార్యాభర్తలు ఈ విషయంపై గొడవ పడ్డారు.ఈ క్రమంలో క్షణికావేశంలో విచక్షణ కోల్పోయినటువంటి ఆమె భర్త చేతికందిన రాయితో రుతిక తలపై దారుణంగా దాడి చేశాడు.
దీంతో తీవ్ర రక్త స్రావానికి గురయినటువంటి రుతిక అక్కడికక్కడే మృతి చెందింది.ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు.అలాగే మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.