బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి రావాలని ఆకాంక్షతో తెలుగు దేశం పార్టీ 2019 ముందు నుంచి ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది.బీజేపీ కేంద్ర పెద్దలు ఎవరూ టీడీపీతో జతకట్టేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.
అయినా బాబు మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.బీజేపీ అగ్ర నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే , బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అనే సంకేతాలను ఇస్తున్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది .ఈ మహానాడులో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం ద్వారా బీజేపీ తో తాము పొత్తు కు సిద్ధంగా ఉన్నాాము అనే సంకేతాలను పంపించారు.అయితే ఈ వ్యవహారంపై బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దియోధర్ స్పందించారు.
చంద్రబాబు కోరుకుంటున్నట్లుగా బిజెపి-టిడిపి పొత్తు ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ ఉండదు అంటూ ఆయన ప్రకటించారు.
అసలు తాము తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడం అనేది జరగదని, ఏపీలో తెలుగుదేశం , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లకు ధీటుగా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ఏకైక లక్ష్యం అంటూ ఆయన ప్రకటించారు.2024 ఎన్నికల్లో టిడిపి , బిజెపి కలిసి పోటీ చేయాలనే ఆకాంక్షను చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు చెప్పడానికి పదేపదే ప్రయత్నించారని , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు పార్టీని వీడకుండా చంద్రబాబు ఇటువంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని సునీల్ దియోధర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. తన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్లుగానే ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని సునీల్ దియోధర్ విమర్శించారు.
ఏపీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న సునీల్ దియోధర్ బీజేపీ-టీడీపీ పొత్తు విషయంలో ఇంత క్లారిటీ గా మాట్లాడడం చూస్తుంటే టీడీపీతో పొత్తు ఆలోచన కాదు కదా, ఆ పార్టీతో తమకు ఎప్పుడు శత్రుత్వం అన్నట్లుగానే వ్యవహారం కనిపిస్తోంది.ఇప్పటి వరకు బీజేపీ తో పొత్తు కోసం రకరకాల మార్గాల్లో ప్రయత్నం చేస్తూ వస్తున్న టీడీపీ కి సునీల్ ధియోధర్ మాటలు పెద్ద షాకే కలిగించాయి.దీనిపై అధికారికంగా టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో ?
.