టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు అర్పిస్తూ ఆయన గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మరి కొంతమంది నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.
సినిమా రంగం నుండి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రజలకు గుర్తింపు నుంచి రాజకీయాల్లోకి వచ్చి తెలుగు జాతిలో చైతన్యం నింపిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
పరిధిలో రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అంటూ అభినందించారు.
అటువంటిది నేడు పిల్లకాకి సంక్షేమం గురించి తెగ మాట్లాడుతుంది, అసలు ఆనాడే సంక్షేమం అంటే ఏంటో ఎన్టీఆర్ తనదైన శైలిలో పథకాలు అమలు చేసి నిరూపించారు.ఇదే రీతిలో ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు అంటే దానికి కారణం ఎన్టీఆర్ అని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అరాచక పాలన అదేవిధంగా రౌడీ పాలన ప్రస్తుతం సాగుతోంది అని సీరియస్ అయ్యారు.తెలుగుదేశం పార్టీ అనేది పోరాటాల పార్టీ అని కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వచ్చి ఈ సారి ఎన్టీఆర్ కి అధికారంలో ఉండి నివాళులర్పిస్తారని అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్లు చేశారు.
.