కడుపు మంట అంటూ టీడీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ మంత్రి..!!

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేయలేని పనులు ఇప్పుడు వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం చేయటం వల్లే టీడీపీ నేతలు ఓర్వ లేక పోతున్నారు అంటూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు.రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో దాదాపు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 83 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయటం జరిగిందని తెలిపారు.

 Ysrcp Minister Kannababu Sensational Comments On Tdp, Kannababu, Ysrcp, Tdp, Yc-TeluguStop.com

ఉచిత బీమా చెల్లింపుల విషయంలో టిడిపి చెల్లించాల్సిన బీమాను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించినట్లు కన్నబాబు స్పష్టం చేశారు.

రైతాంగానికి ఎంతగానో మేలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పై కడుపుమంటతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రైతులను తెలుగు దేశం పార్టీ ఏదో ఉద్ధరించినట్లు ఇటీవల వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయి.అసలు ఏ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందని అన్నది రైతులు గమనిస్తున్నారు అని పేర్కొన్నారు.

అసలు రైతులపై రాజకీయం చేయడం దారుణం అని, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే రీతిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు చేస్తున్నట్లు.

ఈ పథకానికి పీఎం ఫసల్ బీమా యోజన పథకం యొక్క నిధులు కు సంబంధం లేదని తేల్చి చెప్పారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube