చాలా మంది హీజీగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారుల్లో ప్రయాణం చేస్తున్నారు.టెక్నాలజీని వాడుకుని దోపిడీలు, దొంగతనాలు చేసేస్తున్నారు.
కరోనా టైంలోొ దొంగతనాలు ఎక్కువగా జరగడం గమనార్హం.దేశంలో సైబర్ నేరాల హవా పట్టాపగ్గాల్లేకుండా కొనసాగుతోంది.
కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సైబర్ దాడులు పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఏడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఉద్ధృతి 5 రెట్లకు ఎగబాకిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ గతంలో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య నిరంతర సమాచార మార్పిడితో ఎక్కడికక్కడ చోర బృందాల భరతం పట్టేలా చేయాలి.తాజాగా మీసేవా పోర్టల్ వివరాలు హ్యాక్ చేసి పలు సేవల ద్వారా వచ్చే కమీషన్లను కాజేసిన ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడిని విచారించగా దిమ్మతిరిగే విషయాలు వెల్లడించాడు.
వరంగల్కి చెందిన కాసాని జగన్ నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ జీవినం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో విలాసాలకు అవాటుపడి ఈజీ మనీ కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.బైక్పై ఉన్న చలాన్లు కట్టడానికి మీ సేవ సెంటర్కు వెళ్లినపుడు లాగిన్ వివరాలు తెలుసుకున్నాడు.
తన ఫ్రెండ్స్ నుంచి కొంత సమాచారం సేకరించి, యూట్యాబ్లోని వీడియోల ద్వారా మీ సేవా పోర్టర్లో లాగిన్ అయ్యాడు.ఈసీ లాంటి పలు కీలక డాక్యుమెంట్లు నుంచి వచ్చే కమీషన్ను తన అకౌంట్లకు మళ్లించుకున్నాడు.
తన ఐడీ ద్వారా ఇదంతా జరిగిందని తెలుసుకున్న మీసేవా ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశాడు.దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైం టీమ్ రంగంలోకి దిగింది.ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.మన దేశంలో ఇటువంటి హ్యాంకింగ్ కేసులు చాలానే నమోదవుతున్నాయి.
కరోనా టైంలో ఇవి మరీ ఎక్కువయిపోయాయి.