సాహో సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ సుజిత్.ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సాహో మూవీ తర్వాత నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.
ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి పిలిచి లూసీఫర్ రీమేక్ బాద్యతలని అతనికి అప్పగించాడు.అయితే ఏవో వ్యక్తిగత సమస్యలు, పెళ్లి ఉండటంతో దాని నుంచి తప్పుకున్నాడు.
ఆ తర్వాత హిందీలో విక్కీ కౌశల్ తో ఒక మూవీని ఫైనల్ చేసుకున్నాడు.ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకేక్కుతుందని బిటౌన్ లో చర్చ నడించింది.అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ కి కూడా వెళ్ళకుండానే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మరోసారి సుజిత్ మీద నమ్మకంతో అతనిని పిలిచి తమిళ్ హిట్ మూవీ రీమేక్ బాద్యతలని అప్పగించినట్లు తెలుస్తుంది.6 ఏళ్ల క్రితం అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చి హిట్ అయిన ఎన్నై ఆరిందాల్ మూవీని ఇప్పుడు చిరంజీవి రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ తెలుగులో కూడా ఎంత వాడు గాని అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.త్రిష, అనుష్క ఇందులో హీరోయిన్స్ గా నటించారు.
తన కూతురుని కాపాడుకోవడం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ చేసే పోరాటమే ఈ మూవీ కథాంశంగా ఉంటుంది.మరి ఈ మూవీని చిరంజీవి మరోసారి తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తూ ఉండటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దానికితోడు దీనికి రీమేక్ స్క్రిప్ట్ బాద్యతలని యంగ్ టాలెంటెడ్ సుజిత్ కి అప్పగించడం చూస్తూ ఉంటే చిరంజీవి ఇప్పటికి సినిమాల విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నారని టాక్ వినిపిస్తుంది.శ్రీనువైట్లకి ముందుగా ఈ మూవీ స్క్రిప్ట్ బాద్యతలు అప్పగించిన అతను అనుకున్న స్థాయిలో చిరంజీవిని మెప్పించలేకపోవడంతో సుజిత్ ని పిలిచి మరీ చిరంజీవి ఆ మూవీ రీమేక్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తుంది.
అతను కూడా చిరంజీవి ఆశించిన విధంగా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.